ఆరోగ్య శ్రీ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందించాలి: బషీర్

51చూసినవారు
రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఆనందంగా ఉందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవుట్ పేషెంట్లు, ఎక్సే, స్కానింగ్, మందుల ఖర్చు కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నారు. ఆయుర్వేద, హోమియో వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్