గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం మొహర్రం పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం యార్డుకు మిర్చిని తీసుకురావద్దని సూచించారు. బుధవారం మిర్చి క్రయవిక్రయాలు మందకొడిగా సాగాయి. చిరు జల్లులు పడుతుండడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి కనబర్చలేదు. రైతులు మొత్తం 29, 930 బస్తాలు యార్డుకు తరలించారు.