కాకుమాను మండలం గార్లపాడు గ్రామ పరిధిలోని పంట పొలాలలో మంగళవారం స్థానికులు హస్తిపంజరాన్ని గుర్తించారు. సమాచారాన్ని కాకుమాను పోలీస్ కు అందించగా ఎస్సై రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకొని అస్తిపంజరాన్ని పరిశీలించి మగ వ్యక్తిగా నిర్ధారించారు. గార్లపాడు విఆర్ఓ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. సమాచారం తెలిసిన వారు కాకుమాను పోలీసులకు తెలపాలని కోరారు.