అద్దంకి: వరుసగా 2 వ రోజు కొనసాగుతున్న ఎల్.ఐ.సి ఏజెంట్ల నిరసన

67చూసినవారు
అద్దంకి: వరుసగా 2 వ రోజు కొనసాగుతున్న ఎల్.ఐ.సి ఏజెంట్ల నిరసన
బీమా రంగంలో పాలసీదారులకు,ఏజెంట్లకు నష్టం చేకూరుస్తూ, ఎల్ఐసి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని, జీవిత బీమా ఏజెంట్లు సంఘం ప్రతినిధులు, మంగళవారం అద్దంకి ఎల్. ఐ. సి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కనీస బీమా రూ. 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలకు పెంచడం వల్ల, సాధారణ కుటుంబాలు భీమా సౌకర్యాన్ని కోల్పోతున్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా పాత విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్