బాపట్ల పట్టణంలోని రైతుబజార్ ను బుధవారం మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి సందర్శించారు. రైతు బజార్లో వ్యాపారులు రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఆయన చర్యలు చేపట్టారు. రోడ్ల కు అడ్డంకి గా ఉన్న నెట్టుడు బండ్లను తొలగించారు. దుకాణా దారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ వెంట రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.