రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు

8026చూసినవారు
చీరాల 216వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కాయపాలెం నుండి పాపాయిపాలెంకు ఒక ట్రాక్టర్ కూలీలతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగం కారణంగా ట్రాక్టర్ రెక్కలు ఊడటంతో వాటి మీద కూర్చున్న కూలీలు జారిపడగా నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్