అమరావతి లో కట్టడాలను పరిశీలించిన పెమ్మసాని

7382చూసినవారు
అమరావతి లో కట్టడాలను పరిశీలించిన పెమ్మసాని
అమరావతి లో కట్టడాలను గుంటూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్కడ నిరుపయోగంగా ఉన్నా వందల కోట్లు విలువ చేసే ఇనుము ను చూసి జగన్ మోహన్ రెడ్డి కి ఓట్లు వేసే ప్రజలు వీటి అన్నిటిని ఒకసారి చూసి ప్రశ్నించాలన్నారు. అనంతరం టిడ్కో ఇళ్ల నిర్మాణలను పరిశీలించి ఒక అడవి లా తయారు చేశారని కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వీటిని విడిచి వదిలి పోయారని తెలిపారు. భవనాల నిర్మాణాలను చూసి ఒక విజన్ ఉన్న నాయకుడికి, ఒక అరాచకవాదికి, ఒక విధ్వంస వాదికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ఆలోచించుకోవాలన్నారు. పరిపాలన అధ్యక్షుడు కావాలో పరిపాలన చేతకాని, అసమర్థ, దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్