సీఎంకు ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు

766చూసినవారు
సీఎంకు ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు
వైఎస్సార్ యంత్ర సేవా పథకం - రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళా సందర్భంగా గుంటూరుకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్ కు వైసీపీ నాయకులు ఆలా కిరణ్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటూరి విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని రానున్న ఎన్నికలలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి కోటేశ్వరరావు, సందీప్, రాచకొండ నాని, రేణుక, దోప్పలపూడి అంకాల రాజు, సంకూరి రాఘవ, శివన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్