డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిపై చర్యలు తప్పవు: కమిషనర్

52చూసినవారు
డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిపై చర్యలు తప్పవు: కమిషనర్
కొబ్బరి బోండాలు, టిఫిన్ బండ్లు, తోపుడుబండ్ల వ్యాపారులు డ్రైన్ లలో వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం ఏ. టీ అగ్రహారం, శాంతినగర్, సంపత్ నగర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. డ్రైన్లలో ఎప్పటికప్పుడు వ్యర్ధాలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్