దాచేపల్లి లో పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలి

70చూసినవారు
దాచేపల్లి పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని బుధవారం ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా నాగులేరు వాగు పక్కనే ఉన్న మురుగు కాలువ ప్రమాదకరంగా మారిందని కాలువ దోమలకు నిలయంగా మారి అంటు వ్యాధులను వ్యాపింప చేస్తుందన్నారు. గత కొంతకాలంగా శుభ్రం చేయకపోవడంతో మురికి కూపంగా మారిందని అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్