జగన్ పాలనలో దారితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలిగిన నేత చంద్రబాబు మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాడేపల్లి పరిధి గుండిమెడ రచ్చబండ సభలో లోకేష్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీలకు గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేసిన దళిత ద్రోహి జగన్ అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.