అపోహలు వీడండి రక్తదానానికి ముందుకు రండి

76చూసినవారు
నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల శంకర భారతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని సీఐటీయూ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రక్త సేకరణ కేంద్రాలలో నిల్వలు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు. రక్తం కృత్రిమంగా తయారు చేసే పద్ధతులు లేవని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్