వీధులన్నీ శానిటేషన్ చేసిన సిబ్బంది

79చూసినవారు
వరద బీభత్సంతో అమరావతి మండలం మొత్తం జలమయమై రోడ్లన్నీ బురదతో దర్శనమిచ్చాయి. గండ్లు కొట్టి వరద నీరంతా వెళ్ళగొట్టడంతో రోడ్లన్నీ నీరు లేక మామూలు స్థితికి వచ్చాయి. పంచాయతీ అధికారులు బుధవారం మురుగు తొలగించి వీధులన్నీ బ్లీచింగ్ చల్లి శానిటేషన్ పనులు చేపట్టారు. గత రెండు, మూడు రోజులుగా వర్షపు నీటితో ఉన్న వీధులు మొత్తం పూర్తిగా వెళ్లిపోయి మామూలు స్థితికి వచ్చాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్