పత్తి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రవీణ్

62చూసినవారు
పత్తి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రవీణ్
అమరావతి మండలంలోని మునగోడు, మల్లాది, దిడుగు గ్రామాల్లో అలాగే క్రోసూరు మండలంలోని బయ్యవరం, ఊటుకూరు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం పర్యటించారు. దెబ్బతిన్న పత్తి పొలాలను పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాల నష్టం పై అధికారులకు అంచనా వేయాలని సూచించారు. వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్