పొన్నూరు ప్రభుత్వ వైన్ షాపులో చోరీ నిందితుడు అరెస్ట్

78చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం బాపట్ల బస్టాండ్ వద్ద మద్యం దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుకాణంలో పనిచేసే సందీప్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మంగళవారంఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసును సంబంధించిన వివరాలు వెల్లడించారు. రూ. 9, 51, 460 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్