చేబ్రోలు మండలంలోని శలపాడు గ్రామంలో మంగళవారం యూనిట్ ఇంచార్జ్ అభిలాష్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. క్రమం తప్పకుండా ప్రతివారం పొలంబడి నిర్వహించడం వలన పంటలో ఏర్పడే పురుగులు తెగుళ్లు చీడపీడల నివారణకు రైతు సొంతంగా ఆలోచించి నిర్ణయం సొంతంగా తీసుకునేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఏ ఉమాదేవి అన్నారు.