అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి: ధూళిపాళ్ల

66చూసినవారు
పొన్నూరు పట్టణం 22వ వార్డులో గురువారం కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. పొన్నూరులో అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. వార్డు ప్రచారంలో ధూళిపాళ్లకు అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. పెద్ద సంఖ్యలో తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్