విద్యార్థులతో జాతీయ జెండా ర్యాలీ ప్రదర్శన

80చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో బుధవారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలు చేత బూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై , బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జాతీయ భావాన్నిపెంపొందించే విధంగా ర్యాలీ ముందు త్రివర్ణ పతాకాన్ని ఎన్ సి సి విద్యార్థులు పట్టుకొని ముందుకు సాగటం ర్యాలీలో ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్