రూ. 45 లక్షల విలువగల మద్యం సీసాలు ధ్వంసం

77చూసినవారు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాలో పట్టుకున్న మద్యం సీసాలను ప్రత్తిపాడు రూరల్ గుంటూరు నల్లచెరువులోని డంపింగ్ యార్డు వద్ద సోమవారం అధికారులు బుల్డోజర్ తో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీన చేసుకున్నామన్నారు. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు రూ. 45 లక్షలు ఉంటుందని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్