తాడికొండ మండలంలోని మోతడక గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం, శివాలయం మందిరాలను సందర్శించారు. అనంతరం ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.