అర్హులందరికీ పింఛన్లు అందేలా చూసేందుకు సబ్ కమిటీ

69చూసినవారు
అర్హులందరికీ పింఛన్లు అందేలా చూసేందుకు సబ్ కమిటీ
రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై త్వరలో సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.

సంబంధిత పోస్ట్