వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్టు

65చూసినవారు
వ్యసనాలకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి వన్ టౌన్ ఎస్ఐ కరిముల్లా మంగళవారం తెలిపారు. చినరావూరుకు చెందిన బొడగల పార్థసారథి, కుందర సంపత్ కుమార్, ధనావత్ హనుమంత్ నాయక్ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ. 2.40 లక్షల నగదు, బంగారు వస్తువులను పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్