ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గ్రామంలోని ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలపై చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.