AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణు రెడ్డి TDP నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మద్దతుదారులైన అశ్వత్థ, దేవేగౌడపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆస్పత్రిలో వారిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఉంటే తాము చూస్తూ ఊరుకోమని, చేయికి చేయి, కాలుకు కాలు, తలకు తల ఏమైనా చేయడానికి సిద్ధమని వేణు రెడ్డి హెచ్చరించారు.