పదేళ్లలో పది పరిశ్రమలైనా వచ్చాయా?: షర్మిల

60చూసినవారు
పదేళ్లలో పది పరిశ్రమలైనా వచ్చాయా?: షర్మిల
పదేళ్లలో రాష్ట్రానికి పది పరిశ్రమలైనా వచ్చాయా? అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలను అడిగారు. పాయకరావుపేటలో షర్మిల మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలు మూతబడితే తెరిపించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా?. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా?. పదేళ్లలో రాజధాని కట్టగలిగారా?’ అని పశ్నించారు.

సంబంధిత పోస్ట్