దేశంలోని నాలుగు ముఖ్య ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోల్కతా విమానాశ్రయంతో సహా దేశంలోని నాలుగు వేర్వేరు విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లు ఈ మెయిల్ వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆయా ఎయిర్పోర్టులను పూర్తిగా తనిఖీ చేశారు. అనంతరం ఈ ఈ మెయిల్ ఫేక్ అని, ఎటువంటి బాంబు లేదని సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు.