కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేశాడు!

71చూసినవారు
కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేశాడు!
అదనపు కట్నం కోసం ఓ భర్త తన భార్య ఒళ్లంతా కొరికేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్ ముస్కాన్‌కు, గుంటూరుకు చెందిన షేక్ మహ్మద్ రఫీకి ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహం జరిగిన మూడు నెలలు సజావుగానే సాగిన వీరి కాపురంలో భర్త వ్యసనాలు, అదనపు కట్నం వేధింపులు చిచ్చురేపాయి. కట్నం తేవడం లేదంటూ భర్త తన భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండటంతో ఆమె పుట్టింటికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్