AP: గత ప్రభుత్వ హయాంలో నాడు - నేడు పేరుతో విద్యావ్యవస్థను దోపిడీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగణ హయాంలో పాఠశాలల్లో అవినీతి, టీచర్లపై కక్ష సాధింపులు చర్యలకు పాల్పడ్డారని ప్రత్తిపాటి ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ ఏపీ విద్యావ్యవస్థను రోల్ మోడల్ గా చేసేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు.