ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు మంత్రి వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తుచేశారు.