బద్వేల్ : మైనర్ బాలిక పై పెట్రోల్ పోసి హత్య యత్నం

62చూసినవారు
బద్వేల్ పిపి కుంట వద్ద ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని అటవీ ప్రాంతం సమీపాన శనివారం మైనర్ బాలిక పై పెట్రోల్ పోసి గుర్తుతెలియని దుండగులు హత్య కు ప్రయత్నించారు. బాలిక ఒంటికి నిప్పులు అంటుకొని మంటల తాళలేక కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బాలిక బద్వేల్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ గా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్