కడపలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేసిన ఫెడ్లైట్స్ కాంతులలో ఈనెల 30 నుంచి జులై 3 వరకు నాలుగు రోజులపాటు ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర ప్రీమియం లీగ్ సీజన్-3 టి- 20 క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. భరత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిఎల్ సీజన్ -3 మ్యాచ్ ఈనెల 30న కడప వైఎస్ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో ఉంటుందన్నారు.