జిల్లాలో సజావుగా నీట్ ప్రవేశ పరీక్ష

85చూసినవారు
జిల్లాలో సజావుగా నీట్ ప్రవేశ పరీక్ష
కడప జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. కడప అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో 720 మందికి 701, బీరం శ్రీధర్రెడ్డి ఇంటర్నేషనల్ పాఠశాలలో 696 మందికి 670, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 576 మందికి 562 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి లోపలకు పంపించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్