సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పాత పెన్షన్ విధానం అవసరమని అలాంటి పాత పెన్షన్ పై రాజకీయ పార్టీల వైఖరేంటో తెలపాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు కోరారు. మంగళవారం కడపలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు పోస్ట్ కార్డు ద్వారా తమ డిమాండ్ ను తెలిపారు.