ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నీరనాల శివ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కడప నగరంలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో మొదటిసారి నీట్ ఫలితాలపై విద్యాసంస్థలే అనేక అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హమని చెప్పారు. ఉపాధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు.