కడప నగరంలోని విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పంచామృతాభిషేకం నిర్వహించి రాహుకాల పూజలు చేశారు. పంచాంగశ్రవణం నిర్వహించి శుభ ఫలితాలను వివరించారు. నేటి నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు దుర్గామల్లికార్జున రావు, దుర్గాప్రసాద్ తెలిపారు.