చెన్నూరు మండలంలోని శివాలపల్లె హరిజనవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి హనుమ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం నుండి శనివారం వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఉదయం గణపతి పూజ, పుణ్య వాచనం, ఋత్వికరణం, కంకణ దారణం, అఖండ ద్వీపస్తాపనం, విగ్రహ ప్రతిష్ఠ పూజలతో ప్రారంభమవుతాయన్నారు.