రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గత 35రోజులకు పైగా నిరసన తెలియజేస్తూ ఉంటే రాష్ట్ర సీఎం
జగన్ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేశారని అంగన్వాడీలు నిరసన తెలిపారు. మంగళవారం పండుగ రోజు కూడా మైదుకూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు గాలిపటాలతో తమ నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటియుసి, ఐ ఎఫ్ టి యు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.