భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి

57చూసినవారు
భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి
బ్రహ్మంగారి మఠం మండలంలో నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే కు భూములు కోల్పోయిన బాధిత రైతులు ప్రభుత్వము నుండి తమకు అందవలసిన నష్టపరిహారం అందలేదని మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డికి విన్నవించారు. ఈ విషయంపై గురువారం ఆయన ఆర్డీవోతో మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్