గోశాలను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్

62చూసినవారు
దువ్వూరు మండలం చల్ల బసాయపల్లె గ్రామ సమీపంలో తెలుగు గంగా రిజర్వాయర్ వద్ద ఉన్న గోశాలను శనివారం కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులను గోశాల నిర్వహణ పై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులు గోశాలకు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్