మాదక ద్రవ్యాల పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ

68చూసినవారు
మాదక ద్రవ్యాల పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ
యువత సరదా కోసం మత్తు పానీయాలు అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల ఎంపీ స్వగృహంలో మాదక ద్రవ్యాల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంచి భవిష్యత్తు గల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువత  మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చా లని ఆయన యువత కు సూచించారు.

సంబంధిత పోస్ట్