రాబోవు ఎన్నికల దృష్ట్యా సోమవారం వేంపల్లిలో
కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందులో పాటలు, ప్రసంగాలు, నినాదాలు ఉన్నాయి. కేంద్రంలో బిజెపిని అధికారం నుంచి దించి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర్యక అవసరం గురించి వివరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో వున్న వైకాపాను ప్రాంతీయ పార్టీలైన
టీడీపీ, జనసేనలను ఓడించాలన్నారు.