రైల్వే కోడూరు: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఎ శ్రీధర్

50చూసినవారు
రైల్వే కోడూరు: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఎ శ్రీధర్
రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ నియెజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని అన్నారు. ఈ విజయదశమి ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, వర్షాలు సంవృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో, సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్