ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఏప్రిల్ 22న సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8. 30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం ఉంటుందని జేఈవో వీరబ్రహ్మం అన్నారు. సోమవారం ఒంటిమిట్టలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.