కాకినాడలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి

50చూసినవారు
కాకినాడలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి
కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమరయోధుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ 1901 జూలై 6న కలకత్తాలో ముఖర్జీ జన్మించారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ముఖర్జీ హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్