వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీవో కిషోర్ పరిశీలన

55చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీవో కిషోర్ పరిశీలన
ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం రాత్రి ఐదువేల క్యూసెక్కుల నీరు వదలడంతో గొల్లప్రోలు పట్టణంలో శివారు ప్రాంతాలైన జగనన్నకాలనీ, సూరంపేటలో మరింత వరద ఉధృతి పెరిగింది. సోమవారం ఉదయం జగనన్న కాలనీలోని వరద ప్రాంతాన్ని ఆర్డీవో కిషోర్ పరిశీలించారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నిత్యావసరాలు, త్రాగునీరు, మందులు సిద్ధంగా ఉంచాలని ఆర్డీవో కిషోర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్