పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి జగన్నాధ రెడ్డి సమక్షంలో జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్దం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఆమెతో పాటు, ఆమె భర్త పాముల రంగారావు తదితరులకు జగన్మోహన్ రెడ్డి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019లో జనసేన పార్టీ తరపున పి. గన్నవరం నుంచి పాముల రాజేశ్వరీదేవి పోటీ చేసి ఓడిపోయారు.