ద్వారకాతిరుమలకు పోటెత్తిన భక్తులు

57చూసినవారు
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం శనివారం గోవిందనామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, జంటగోపురాలు, ప్రసాదం, టికెట్ కౌంటర్ లు భక్తులతో నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్