కొవ్వూరు: గ్రామాలను వైసీపీ నిర్లక్ష్యం చేసింది- ఎమ్మెల్యే

84చూసినవారు
అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి గత ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. శనివారం చాగల్లు మండలం చాగల్లు, నెలటూరు, మీనా నగరం, ఊనగట్ల గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధే తప్ప, 2019-2024లో చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్