ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ గ్రామ సభల ద్వారా గ్రామాల దశ మారనుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేటలోని ఏడిదలో ఉపాధి హామీ పథకం గ్రామసభ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు.