వరద ఉద్ధృతిని పరిశీలించిన ఆర్డీవో

72చూసినవారు
వరద ఉద్ధృతిని పరిశీలించిన ఆర్డీవో
పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద దబ్బా కాలువ వరద పరిస్థితిని ఆర్డీవో సీతారామారావు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 6000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయటంతో పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం పరిధిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, తహశీల్దార్లు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్డీవో సీతారామారావు ఆదేశించారు. ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్